Share this on your social network:
Published:
08-05-2017

జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాగవతుల వెంకటరాజమోహన్‌ ఈ నెల 4వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం ఇంటికి చేరుకొనేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాను సైతం పగులగొట్టి విలువైన బంగారు వస్తువుల్ని దోచుకొన్నట్టు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో జి.కొండూరు ఎస్సై డి.రాజేష్‌ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. బీరువాలో ఉన్న దాదాపు 55 గ్రాముల బంగారు ఉంగరం, గొలుసులు, చెవిదిద్దులు, గాజులు, వెండి గ్లాసులు, గంధపు బరిణెలు, కుంకుమ బరిణెలు, ఉద్ధరిణి తదితర వస్తువులు చోరీకి గురైనట్టు రాజమోహన్‌ భార్య వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.50 వేల నగదు కూడా చోరీకి గురైనట్టు రాజమోహన్‌ తెలిపారు. చోరీకి గురైన వస్తువుల విలువ రూ.3 లక్షలకు పైబడి ఉంటుందని చెపుతున్నారు. దొంగతనం గురించి చుట్టుపక్కల వారికి ఏ మాత్రం అనుమానం రాకుండా దొంగలు చర్యలు తీసుకున్నారు. ఇంటి ముందు వైపు తలుపులను ముట్టుకోకుండా దక్షిణ వైపు గోడ దూకి లోపలికి ప్రవేశించడంతో ఎవరికీ తెలియకుండా పోయింది. రాజమోహన్‌ 4వ తేదీ రాత్రి వూరెళ్లగా.. దొంగతనం ఎప్పుడు జరిగిందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. దొంగతనం జరిగి రెండు మూడు రోజులై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related Images



Related News


విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం

విజయవాడ: విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చ


ASP-DSP గుడివాడ పట్టణంలో ఆకస్మిక తినిఖీ

ASP సత్తిబాబు DSP సత్యానందం గారితో కలిసి గుడివాడ పట్టణంలో నగవరప్పాడు, దొండ


తోటి పోలీసు సిబ్బంది, పోలీసు అధికారులకు అల్పాహారం ఏర్పాటు

తిరువూరు టౌన్ :ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోని అంతరాష్ట్ర చెక్ పో


పీటీఎం ఉద్యమ నేత ఆరిఫ్‌ వజీర్ దారుణ హత్య

పాకిస్తాన్‌లో పష్తూన్ తహఫ్పూజ్ ఉద్యమ(పీటీఎం) నేత ఆరిఫ్‌ వజీర్‌ శనివార


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


హైదరాబాద్‌లో నిమ్మగడ్డ పీఎస్‌ను విచారిస్తున్న సీఐడీ!

రాష్ట్ర, జాతీయ స్థాయిలో కలకలం రేపిన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


సత్తెనపల్లిలో యువకుడి మృతి

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘట


కన్నతల్లి నిర్వాకం.. అడ్డుకున్న యంత్రాంగం

విజయవాడ చుట్టుగుంట గులామ్‌ ఉద్దీన్‌నగర్‌లో పది రోజుల మగ శిశువును విక


మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మి విరాళంగా 10 వేల రూపాయల చెక్కు అందజేత.

సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు డీ.సీ.ఆర్బి మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మ


అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి

అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి పోలీసు స్టేషన్ వద్ద ఆం


తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

జన్మనిచ్చిన తల్లి భారమైందని ఓ దుర్మార్గపు కొడుకు ఆమెను బ్రతికుండగాన