Share this on your social network:
Published:
26-04-2017

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి వారి నుంచి రూ.1.13 లక్షల డ‌బ్బు, సెల్‌ఫోన్లు, రెండు కార్లు, ల్యాప్‌టాప్‌, టీవీని స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ సత్యానందం, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ కె.మురళీధర్ విజ‌య‌వాడ పటమట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు. గుడివాడ రామివారి వీధికి చెందిన మిరియాల వెంకట నాగ ఈశ్వరరావు ఎనికేపాడులోని మహితా నివాస్‌ అపార్టుమెంట్‌లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. గుడివాడకు చెందిన గోగం సురేష్‌, పుట్టి రాజులను ఫ్లాట్‌లో ఉంచి ఇక్కడి నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌లు కాసేవాడు. ఈశ్వరరావు ముంబయిలో ఒక బుకీతో పరిచయం ఏర్పర్చుకున్నాడు. అతనితో ఫోన్‌లో వివరాలు తెలుసుకుంటూ, దాని ప్రకారం పందేలు నిర్వహించేవాడు. దీనిపై సమాచారం అందడంతో టాస్క్‌పోర్సు పోలీసులు నిఘా ఉంచి, పక్కా సమాచారంతో ఫ్లాట్‌లో తనిఖీలు నిర్వహించారు. పందేలు కాస్తున్న నిర్వాహకుడు నాగ ఈశ్వరరావు, గోగం సురేష్‌, పుట్టి రాజును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పదమూడు సెల్‌ఫోన్లు, స్విఫ్ట్‌ డిజైర్‌, రెనాల్ట్‌ డస్టర్‌ కార్లు, ల్యాప్‌టాప్‌, ఎల్‌ఈడీ టీవీని స్వాధీనం చేసుకొని పటమట పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని విచారించగా, బెట్టింగ్‌కు పాల్పడుతున్న మరో నలుగురి సమాచారాన్ని ఇచ్చారు. దాని ప్రకారం విజయవాడ దేవీనగర్‌కు చెందిన వేగిరెడ్డి శ్రీనివాసరావు, పెనమలూరుకు చెందిన వెలగా అజయ్‌భాస్కర్‌, మైనేని దుర్గాప్రసాద్‌, పెడన మండలం కొంతెపూడికి చెందిన లుక్కా వీర రాఘవులును అరెస్టు చేశారు. ముంబయిలోని వ్యక్తితో వీరికి ఉన్న సంబంధాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Related Images



Related News


విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం

విజయవాడ: విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చ


ASP-DSP గుడివాడ పట్టణంలో ఆకస్మిక తినిఖీ

ASP సత్తిబాబు DSP సత్యానందం గారితో కలిసి గుడివాడ పట్టణంలో నగవరప్పాడు, దొండ


తోటి పోలీసు సిబ్బంది, పోలీసు అధికారులకు అల్పాహారం ఏర్పాటు

తిరువూరు టౌన్ :ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోని అంతరాష్ట్ర చెక్ పో


పీటీఎం ఉద్యమ నేత ఆరిఫ్‌ వజీర్ దారుణ హత్య

పాకిస్తాన్‌లో పష్తూన్ తహఫ్పూజ్ ఉద్యమ(పీటీఎం) నేత ఆరిఫ్‌ వజీర్‌ శనివార


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


హైదరాబాద్‌లో నిమ్మగడ్డ పీఎస్‌ను విచారిస్తున్న సీఐడీ!

రాష్ట్ర, జాతీయ స్థాయిలో కలకలం రేపిన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


సత్తెనపల్లిలో యువకుడి మృతి

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘట


కన్నతల్లి నిర్వాకం.. అడ్డుకున్న యంత్రాంగం

విజయవాడ చుట్టుగుంట గులామ్‌ ఉద్దీన్‌నగర్‌లో పది రోజుల మగ శిశువును విక


మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మి విరాళంగా 10 వేల రూపాయల చెక్కు అందజేత.

సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు డీ.సీ.ఆర్బి మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మ


అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి

అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి పోలీసు స్టేషన్ వద్ద ఆం


తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

జన్మనిచ్చిన తల్లి భారమైందని ఓ దుర్మార్గపు కొడుకు ఆమెను బ్రతికుండగాన