Share this on your social network:
Published:
23-04-2017

యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తిమ్మిరి కిరణ్‌కుమార్‌ అనే యువకుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుడైన పొలిమెట్ల శ్రీకాంత్‌ను కృష్ణలంక పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ నెల 18న సాయంత్రం 4.30 ల సమయంలో లబ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్స్‌లోని ఖాళీ స్థలంలో తిమ్మిరి కిరణ్‌కుమార్‌, రవితేజ, కార్తీక్‌, వంశీకృష్ణ, రేవంత్‌, చందు, పవన్‌, ఆది, అవినాష్‌ తిదితరులు క్రికెట్‌ ఆడుతున్నారు. సుమారు 4.45 గంటల సమయంలో చందు అనే యువకుడు బాల్‌ను కొట్టగా అది సమీపంలో ఉన్న దేవకీదేవి అనే మహిళకు తగిలింది. క్రికెట్‌ ఆడుతున్న వారంతా ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలో మేడపై నుంచి చూస్తున్న దేవకీదేవి కుమారుడు శ్రీకాంత్‌ అక్కడకు వచ్చి వారందరినీ దుర్భాషలాడారు. కిరణ్‌కుమార్‌ ఈ విషయమై కల్పించుకోగా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. గతంలో శ్రీకాంత్‌, కిరణ్‌కుమార్‌ల మధ్య గొడవలు ఉన్నాయని ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇదంతా మనసులో పెట్టుకున్న శ్రీకాంత్‌ కోపంతో ఇంట్లోకి వెళ్లి ఒక చాకును తీసుకువచ్చి కిరణ్‌కుమార్‌ ఛాతిలో ఎడమవైపు పొడిచాడు. దీంతో అతను కుప్పకూలిపోగా బంధువులు, చుట్టుపక్కల వారు అతనిని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు నిందితుడి శ్రీకాంత్‌ కోసం గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం పి అండ్‌ టి క్వార్టర్లలోకి దొంగచాటుగా వస్తుండగా కృష్ణలంక సీఐ చంద్రశేఖర్‌ తన సిబ్బంది సాయంతో శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. సమీపంలోని పొదల్లో పడేసిన చాకును స్వాధీనం చేసుకున్నారు.

Related Images



Related News


విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం

విజయవాడ: విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చ


ASP-DSP గుడివాడ పట్టణంలో ఆకస్మిక తినిఖీ

ASP సత్తిబాబు DSP సత్యానందం గారితో కలిసి గుడివాడ పట్టణంలో నగవరప్పాడు, దొండ


తోటి పోలీసు సిబ్బంది, పోలీసు అధికారులకు అల్పాహారం ఏర్పాటు

తిరువూరు టౌన్ :ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోని అంతరాష్ట్ర చెక్ పో


పీటీఎం ఉద్యమ నేత ఆరిఫ్‌ వజీర్ దారుణ హత్య

పాకిస్తాన్‌లో పష్తూన్ తహఫ్పూజ్ ఉద్యమ(పీటీఎం) నేత ఆరిఫ్‌ వజీర్‌ శనివార


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


హైదరాబాద్‌లో నిమ్మగడ్డ పీఎస్‌ను విచారిస్తున్న సీఐడీ!

రాష్ట్ర, జాతీయ స్థాయిలో కలకలం రేపిన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


సత్తెనపల్లిలో యువకుడి మృతి

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘట


కన్నతల్లి నిర్వాకం.. అడ్డుకున్న యంత్రాంగం

విజయవాడ చుట్టుగుంట గులామ్‌ ఉద్దీన్‌నగర్‌లో పది రోజుల మగ శిశువును విక


మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మి విరాళంగా 10 వేల రూపాయల చెక్కు అందజేత.

సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు డీ.సీ.ఆర్బి మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మ


అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి

అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి పోలీసు స్టేషన్ వద్ద ఆం


తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

జన్మనిచ్చిన తల్లి భారమైందని ఓ దుర్మార్గపు కొడుకు ఆమెను బ్రతికుండగాన