Share this on your social network:
Published:
19-08-2020

14 ఏళ్ళ మైనర్ బాలికపై యువకుల అత్యాచారం 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

విస్తుపోయే నిజాలు వెల్లడించిన తెనాలి డిఎస్పి కె.శ్రీలక్ష్మి ఏపీలో మానవ మృగాల తీరు మారలేదు, మైనర్ బాలికలపై అత్యాచారాలు చేయటం అలవాటుగా మార్చుకుంటున్నారు, అలాంటివారిపై జగన్ సర్కార్ కఠినంగా శిక్షించి సదరు వ్యక్తులపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనను కొందరు కామాంధులు మరిచారు.వివరాల్లోకెళితే తెనాలి ముత్యంశెట్టిపాలెంకు చెందిన 14 ఏళ్ల బాలికను గత నెల 26న కిడ్నాప్ చేసి రెండువారాలపాటు హత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.అయితే కేసునమోదైన 24 గంటల్లో తెనాలి పోలీసులు ఆ కేసును ఛేదించారు.ఈ సందర్భంగా తెనాలి డిఎస్పి కె.శ్రీలక్ష్మి తెనాలి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. పొన్నూరు సమీపంలోని కర్లపాలెం చెందిన నూతలపాటి నవీన్ కుమార్,పద్నాలుగేళ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి, చందోలు దగ్గర ఇంటూరు లాగు దగ్గరికి తీసుకుని వెళ్లి,ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం తెనాలి వైకుంఠపురం దగ్గర వదిలి వెళ్ళాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళితే తల్లిదండ్రులు మందలిస్తారనే.. భయంతో అర్థరాత్రి స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు ఆ మైనర్ బాలిక పేరేచర్ల చేరుకుంది. అదే సమయంలో హెం గార్డ్ అశోక చక్రవర్తి, అతని స్నేహితుడు మైనర్ బాలికను వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారని,ఆ సమయంలో బాలిక భయాందోళనకు గురి కావడంతో,వెంటనే హోంగార్డ్ తన ఐడి కార్డు చూపించి, మీరు భయపడాల్సిన అవసరం లేదని, నేను హోంగార్డ్ ని నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్తే నేను తీసుకు వెళ్తానని నమ్మబలకగా..ఆ మైనర్ బాలిక వివరాలు చెప్పింది.తదనంతరం ఆ బాలికను హోంగార్డు వాహనంపై తీసుకుని వెళ్లి ఒక గదిలో నిర్బంధించి,తనతోపాటు స్నేహితులతో కలిసి అతిక్రూరంగా రెండు వారాల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మైనర్ బాలిక మనోదైర్యాన్ని కోల్పోకుండా ఈనెల 13న వారి చెర నుండి తప్పించుకొని, తెనాలిలోని తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది. జరిగిన సంఘటనలు తల్లిదండ్రులకు పూర్తిగా వివరించింది.కంగారుపడిన తల్లిదండ్రులు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన తెనాలి పోలీసులు ఫిర్యాదు చేసిన 24 గంటల్లో కేసును ఛేదించారు.సదరు నిందితులు గుంటూరు అర్బన్ పోలీస్ పరిధిలో హోంగార్డుగా పని చేస్తున్న అశోక చక్రవర్తి, అతని స్నేహితుడు,దుర్గారావును అదుపులోకి తీసుకొని,తమదైన శైలిలో విచారణ జరుపగా నిందితులు చేసిన తప్పును ఒప్పుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై నిర్భయ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేసినట్లు తెనాలి డిఎస్పి కె.శ్రీలక్ష్మి మీడియా సమావేశంలో తెలిపారు.ఏదిఏమైనా మహిళలు జాగ్రత్తగా ఉండాలని, బాలికలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, డిఎస్పి శ్రీలక్ష్మి హెచ్చరికలు జారీచేశారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సిఐ రాజేష్ కుమార్.స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Images



Related News


సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు

సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు బర్ద్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓ పీ సేవల


ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలు

ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలివీ.. కర్నూలు (17): కర్నూలు (పట్టణ), నం


సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్‌ గ్రీన్‌సిగ్నల్‌

మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని


గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర‌కు అవ‌కాశం

2017 హజ్ కు సంబంధించి హాజ్ యాత్రికుల్లో అవగాహన పెంచడం కోసం గుంటూరు లోని అ


వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు

వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ర


2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి

భూసేకరణ అవసరం లేకుండానే, ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే బెంజిసర్కిల


వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు

వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు ఇకపై ఎ


ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసి


18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ 18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ ఓపెన్ !

లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తున్న కేంద్రం ఇప్పుడు ప్రజలకు ఎంటర్‌టైన్


14 ఏళ్ళ మైనర్ బాలికపై యువకుల అత్యాచారం 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

విస్తుపోయే నిజాలు వెల్లడించిన తెనాలి డిఎస్పి కె.శ్రీలక్ష్మి ఏపీలో మా


ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

సామాగ్రి అపహరణ కేసులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గి


మొహర్రం , వినాయక చవితి పర్వదినాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల

మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు అధికారులు సమావేశం  నిర్వహించారు. 


ఎమ్మెల్సీ బరిలో కోదండరాం! రెండు స్థానాల్లో పోటీకి టీజేఏసీ నిర్ణయం దుబ్బాక ఉప ఎన్నికలో పోటీపై కమిటీ

పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్


కరోనా లో డ్యూటీ లు నిర్వహిస్తున్న డ్రైవర్స్ కు హెల్త్ కార్డులు ఇవ్వాలి ..

. CITU దేశ వ్యాప్తంగా CPM పార్టీ నిరసన వారం సందర్భంగా కొండపల్లి IOCL గ్యాస్ ఫ్ల


రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఆదుకోవాలి-DYFI

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో DYFI జి


గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించండి శాసనసభ్యులు గద్దె రామమోహన్

గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో 15 వేల కోట్లతో 15 లక్షల గృహాలు నిర్


హసన్,హుసేన్ త్యాగమే మొహారం - జిలానిమాలిక్

నాయబ్ బజార్ బారిమమ్ పీర్ల చవిడి,జమిందార్ పీర్ల చవిడి, పట్టణంలోని వివిధ


హోమియో మందుల పంపిణీ

మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారానే కరోనాని క


పులివెందులలో ఆగని కరోనా కల్లోలం

పులివెందుల విన్యూస్: కడప జిల్లా పులివెందుల పట్టణంలో కరోనా రోజు రోజుకు


మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయండి... పోలీసులకు తిరుమల నాయుడు ఫిర్యాదు

హిందువుల మనోభావాలను దెబ్బతినేలా, భగవంతుణ్ని సైతం కించపరుస్తూ మత ఘర్ష


చెంచుల భూముల కోసం నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన

చెంచులకు భూములు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ 24/09/2020 గురువారం ఉదయం11గం


ప్రతి ఒక్క రైతును ఆదుకుంటాం హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కడపజిల్లా మైలవరం మండలం లోని నవాబ్ పేట గ్రామంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డ


హ్యూమన్ రైట్స్ మిషన్ ఆంధ్రప్రదేశ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా కోయ సుధ.

ప్రజల హక్కులకు భంగం కలగకుండా చూడటమే హ్యూమన్ రైట్స్ మిషన్ ధ్యేయం అని హ్


విద్యార్థుల్లో అంతర్గత సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పోటీ పరీక్షల దోహదపడతాయి : సిఐ

విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పోట


నాటి ఇందిర జల ప్ర బె నేటి వైయస్సార్ జలకళ

కాంగ్రెస్ కాలంలో అమలైన వివిధ పరకాల కే పేర్లు మార్చి ప్రస్తుత ప్రభుత్వ


చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన కడప జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మేకల ముని యాదవ్

తెలుగుదేశం పార్టీ అధినేత అయినా నారా చంద్రబాబు నాయుడు యాదవులకు బీసీలక