Share this on your social network:
Published:
02-05-2020

అష్ట దిగ్బంధంలో నరసరావుపేట

గుంటూరు : జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ప్రధానంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న గుంటూరు, నరసరావుపేటలో ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట కేంద్రంగా ఎక్కువగా వైరస్‌ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 253 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వాటిలో 109 కేసులు రూరల్‌ జిల్లాలోనివే. అందులోనూ 75 కేసులు ఒక్క నరసరావుపేటలోనివే. దీంతో నరసరావుపేటలో 29, 30 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెండు రోజులు ప్రజలెవ్వరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. పట్టణం చుట్టూ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చేవారిని 14 రోజుల క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరిస్తున్నారు. పోలీసులు పేటలో నమోదైన పాజిటివ్‌ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 920 ప్రైమర్, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. ఇంకా 200 మందికిపైగా గుర్తించి క్వారంటైన్‌ చేయాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో కాంటాక్ట్‌ల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు ప్రత్యేక బృందాల్లో పని చేస్తున్నారు.

Related Images



Related News


బాబు దుర్మార్గ వైఖరే కోడెల ఆత్మహత్యకు కారణం: అంబటి

కోడెల జయంతిని పురస్కరించుకుని అతని ఆత్మహత్యను వైఎస్సార్‌సీపీ మీదకు న


అల్ప పీడనం.. మత్సకారులకు హెచ్చరిక

దక్షిణ అండమాన్‌ నుంచి ఆగ్నేయ బంగాళఖాతం వరకు అల్ప పీడనం ఏర్పడినట్లు ఆం


ఏపీ కార్మికులను తీసుకొచ్చేందుకు 9 రైళ్లు: ఆళ్ల నాని

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ కార్మికులను తీసుకొచ్చేందుకు 9 రైళ్ల


లాక్‌డౌన్‌తో చేనేత రంగం కుదేలైంది: పవన్‌కల్యాణ్

లాక్‌డౌన్‌తో చేనేత రంగం కుదేలైందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆందోళన


ఒడిశా కూలీల అనుమానాస్పద మృతి

వెల్దుర్తి: మండలంలోని రత్నపల్లె సమీపంలోని రెండు వేర్వేరు ఇటుకల బట్టీ


గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు: గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్ర


మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మాథెరపీకి అనుమతి

మంగళగిరి ఎయిమ్స్‌ (ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్


అష్ట దిగ్బంధంలో నరసరావుపేట

గుంటూరు : జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చ


పవిత్ర రంజాన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అంశాలు:

పవిత్ర రంజాన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అంశా


మే 30న రైతు భరోసా...జగన్ తాజా నిర్ణయం

మే 30న రైతు భరోసా...జగన్ తాజా నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 3


ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లొచ్చు

ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లొచ్చు రాష్ట్రంలో వివిధ ప్రాంత


వైసీపీ కార్యకర్తకు కత్తి పోట్లు : దుండగులు కోసం అన్వేషణ లో పోలీసులు:

: పొన్నూరు : స్థానిక నిడుబ్రోలు కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కా


పొన్నూరు లో బీజేపీ - జనసేనపార్టీల సంయుక్త నిరసన:

( విన్యూస్ , పొన్నూరు ) : అంతర్వేది రధం దగ్ధం వరుసగా హిందూ దేవాలయాల పై దాడ


ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టిన జనసేన వీర మహిళ

:( విన్యూస్ , పొన్నూరు ) :జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్   పిలుపు మేరకు జనస


ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయాధికారులు

:( విన్యూస్ , పొన్నూరు ) : పొన్నూరు పట్టణంలోని ఎరువుల దుకాణాలను గురువారం


కూరగాయల ధరలు నియంత్రణ లో అధికారులు విఫలం.

తెనాలి సెప్టెంబర్10 విన్యూస్ రోజు రోజు కు పెరుగుతున్న కూరగాయల ధరలు, అరి