Share this on your social network:
Published:
04-05-2020

అది ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం

ఇటీవల తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కర్ణాటక, మధ్యప్రదేశ్‌ పరుగు వీరులకు భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) అత్యవసర ట్రయల్స్‌ నిర్వహించడం ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయమని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు వివరించారు. కర్ణాటక సంప్రదాయక క్రీడ కంబళ పోటీల్లో బోల్ట్‌ కన్నా వేగంగా 100 మీ. దూరాన్ని 9.55 సెకన్లలోనే పూర్తిచేసిన శ్రీనివాస్‌ గౌడ (కర్ణాటక), మధ్యప్రదేశ్‌కు చెందిన రామేశ్వర్‌ గుర్జార్‌లకు సోషల్‌ మీడియాలో విపరీత ఆదరణ దక్కింది. భారత్‌కు మరో ఉసేన్‌ బోల్ట్‌ దొరికాడంటూ సోషల్‌ మీడియా కోడై కూసింది. దీంతో స్పందించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వారికి ట్రయల్స్‌ నిర్వహించగా అంచనాలను అందుకోలేదని తాజాగా కిరణ్‌ రిజిజు ప్రకటించారు. ‘గుర్జార్‌ పరుగెత్తుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అప్పుడు నేను స్పందించకుండా ఉంటే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించేవారు. అతనికి ట్రయల్స్‌ నిర్వహించగా గుర్జార్‌ అతికష్టమ్మీద 12.9 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తిచేశాడు. ట్రయల్స్‌లో జూని యర్లతోనే పోటీపడలేకపోయాడు. అతని వయస్సు 26 ఏళ్లు కాబట్టి ఇప్పుడు అతనికి కొత్తగా శిక్షణ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. కానీ ప్రజలకు తెలియదు కదా. అందుకే ట్రయల్స్‌ నిర్వహించాం. అంతర్జాతీయ స్ప్రింట్‌ ప్రమాణాలపై సరైన అవగాహన లేకుండానే అతను బోల్ట్‌ను మించగలడంటూ దేశమంతా నమ్మింది’ అంటూ రిజిజు వివరించారు.

Related Images



Related News


రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్‌: చాపెల్‌

ఆసీస్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కంటే టీమిండియా కెప్


కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ వాయిదా

ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంత


ప్రకటించిన నజరానా ఇవ్వండి: ఏఐసీఏపీసీ

భారత దివ్యాంగుల క్రికెట్‌ జట్టుకు ప్రకటించిన నజరానా మొత్తాన్ని విడుద


నాగాయ‌లంక‌లో జ‌ల‌క్రీడ‌ల ఏర్పాటుకు స్థ‌ల ప‌రిశీల‌న‌

జలక్రీడల శిక్షణా కేంద్రంగా ఎంపికైన నాగాయలంకలో ఏయే క్రీడలకు అవకాశాలున


గుంటూరులో అమ‌రావ‌తి ఓపెన్ కరాటే ఛాంపియ‌న్ షిప్‌

విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని పెంచుకుని శారీరకంగా, మానసికంగా


అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా గుర‌జాల ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ పోటీలు

గురజాల ప్రభుత్వ కళాశాల మైదానంలో అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని జ


క్రికెట్ లో క్రీడాకారులు మ‌రింత‌గా రానించాలిఃబిసీసీఐ క‌మిటీ చైర్మ‌న్ ఎంఎస్ కె . ప్ర‌సాద్

అమరావతిలో గొప్ప క్రికెటర్లు తయారుకావాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర


అత్యంత హుషారుగా పోలీసుల క్రికెట్ పోటీలు

మచిలీపట్నం వేదికగా జరుగుతున్న పోలీసుల సబ్‌డివిజనల్‌ క్రికెట్‌ పోటీల


మే1నుంచి 31వ‌ర‌కు వేస‌వి క్రీడా శిక్ష‌ణ‌

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలను


అది ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం

ఇటీవల తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కర్ణాటక, మ


టీజీవీ భార‌త్ ఆంద్ర బ్యాడ్మింట‌న్ లీగ్ (ఏబిఎల్)లో గోదావ‌రి గ‌న్స్ జ‌ట్టు విజ‌యం

రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన టీజీవీ భరత


రెజ్లింగ్‌ కోచ్‌లకు అందని జీతాలు

కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పన


మరో ఫన్నీ వీడియో షేర్‌ చేసిన వార్నర్‌

ఇటీవల వరుస పెట్టి టిక్‌టాక్‌ వీడియోలు చేసుకుంటూ పోతున్న ఆస్ట్రేలియా


‘ప్రపంచ చాంపియన్‌షిప్’‌ తేదీల్లో మార్పు

వచ్చే ఏడాది ఆగస్టులో స్పెయిన్‌ వేదికగా జరగాల్సిన ప్రపంచ బ్యాడ్మింటన్